telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

న్యాయం కోసం సీఎం జగన్ దగ్గరకు దివ్య తల్లిదండ్రులు..

cm jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్వి తల్లిదండ్రులు ఇవాళ కలవనున్నారు. హోంమంత్రి సుచరితతో కలిసి ఇవాళ మద్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు దివ్య తేజస్వి తల్లిదండ్రులు. సీఎం గారిని కలిసే ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం పరామర్శించడానికి వెళ్లిన హోంమంత్రి సూచరితను అభ్యర్ధించిన దివ్య కుటుంబసభ్యులు. దివ్య తేజస్వి తల్లిదండ్రుల విజ్ఞప్తితో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపారు హోమ్ మంత్రి సూచరిత. దివ్య పేరెంట్స్ ను కలవడానికి ఇవాళ మద్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. హోమ్ మంత్రి సమక్షంలో కలిసి జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి దివ్య తేజస్వి తల్లిదండ్రులు తీసుకెళ్లనున్నారు. దివ్య తేజస్వి హత్య కేసులో ఇప్పటికే దూకుడుగా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Related posts