రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి ఆఫీస్ లోనే మంటల్లో కాలుతుంటే. ఆమెను కాపాడేందుకు వెళ్లి తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ గురునాథం ఈ ఉదయం మరణించాడు. సూర్యాపేటకు చెందిన గురునాథం, గడచిన ఎనిమిది సంవత్సరాలుగా విజయారెడ్డి వద్దే డ్రైవర్ గా గుర్నాధం పని చేస్తున్నాడు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గురునాథానికి భార్య, ఒక బిడ్డ ఉండగా, ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది.
నిన్న సురేశ్, తహసీల్దారు గదిలోకి వెళ్లి, తలుపులు బిగించి, ఆమెకు నిప్పంటించిన వేళ, తొలుత తలుపులను పగులగొట్టి, లోనికి దూసుకెళ్లింది గురునాథమే. ఈ ఘటనలో అతనికి 80 శాతం మేరకు గాయాలు కాగా, అపోలో ఆసుపత్రికి తరలించిన పోలీసులు, చికిత్సను అందిస్తున్నారు. తీవ్ర గాయాలు కావడంతోనే ఆయన మరణించాడని వైద్య వర్గాలు వెల్లడించాయి.