telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆటోలపై జగన్ ఫొటోలను పెట్టుకోండి: మంత్రి అవంతి

వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేడు ఏలూరులో ప్రారంభించారు. ఈ పథకం కింద సొంత ఆటో, కారు ఉన్న డ్రైవర్లకు ప్రతి ఏటా రూ. 10 వేలను ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విశాఖలో ఈ కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలపై జగన్ ఫొటోలను పెట్టుకోవాలని సూచించారు. జగన్ ఫొటో పెట్టుకుంటే ఆర్టీఏ అధికారులెవరూ ఇబ్బంది పెట్టరని అన్నారు. కేవలం విశాఖలోనే 25 వేల మంది డ్రైవర్లకు సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు మంత్రి వాహన మిత్ర పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Related posts