టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో కేవలం ముప్పై శాతం పనులు మాత్రమే చేసిందని మంత్రి అనిల్ ఉద్ఘాటించారు. పోలవరంలో ఒక భాగానికి సంబంధించిన రూ.18వేల కోట్ల వర్క్లో 70శాతం పనులు మాత్రమే టీడీపీ చేసిందని వివరించారు. దేవినేని ఉమకు పోలవరం ప్రాజెక్టుపై కనీసం పరిజ్ఞానం కూడా లేదని విరుచుకుపడ్డారు.
మొత్తం ప్రాజెక్టులో చూస్తే కనీసం 30శాతం కూడా చేయలేదని విమర్శించారు. అయినప్పటికీ టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టు పనులు 70శాతం చేశామని అబద్దాలు చెబుతూనే ఉన్నారని మంత్రి నిప్పులు చెరిగారు.
అదేవిధంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి జీవో 203 జారీ చేయడంపైనా మంత్రి స్పందించారు. జీవో 203పై ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు వివరణ కోరిందన్నారు. జీవో జారీపై వివరణ ఇస్తామన్నారు. వివరణకు సంబంధించి ప్రాసెస్ జరుగుతోందని మంత్రి అన్నారు.
ట్రంప్ శిష్యుడు జగన్…