కేంద్రమంత్రి అమిత్షా రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అమిత్షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలికారు. తిరుపతి తాజ్ హోటల్లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్షాకు సీఎం జగన్ స్వాగతం పలికారు.
ఆ తరువాత అమిత్ షా, సీఎం జగన్తో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి 9.30 గంటల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.
అమిత్షా షెడ్యూల్ ఇలా..
రేపు అమిత్షా నెల్లూరు స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం అమిత్షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటి జరుగనుంది. ఈ సమావేశానికి సౌత్ రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత రాష్ట్రాల లెఫ్ట్నెంట్ గవర్నర్లు, మంత్రులు హాజరుకానున్నారు.
ఆదివారం సీఎం షెడ్యూల్ ఇలా..
ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్ హోటల్లో అమిత్ షా అధ్యక్షతన జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
కాగా..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
వైసీపీ నేతల వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి స్ర్టాంగ్ రియాక్షన్