హైదరాబాద్లోని చందానగర్లో విషాదం చోటుచేసుకుంది.చందానగర్కు చెందిన మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోర్టులో ఎప్పుడూ చలాకీగా ఉండే యంగ్ లాయర్ శివాని చివరికి విగత జీవిగా కనిపించింది.
ఈమెకు ఐదు సంవత్సరాల క్రితం అర్జున్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. లాయర్ శివాని తన భర్త, కొడుకుతో కలిసి చందానగర్ లోని లక్ష్మీ విహార్ ఫేజ్ వన్ ఢిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
భర్తతో గొడల కారణంగా మనస్తాపం చెందిన శివాని.. శనివారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. . ఘటనకు సంబంధించి శివాని భర్త అర్జున్ చందానగర్ పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. శివాని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు.