ఉత్తమ్ కుమార్రెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అభ్యర్ది జానారెడ్డి అని.. ఆయన మంచి మెజారిటీ తో గెలుస్తారన్నారు. ప్రజలు ఈసారి కాంగ్రెస్ను ఆదరిస్తారని పేర్కొన్నారు. బీజేపీ గాలి బుడగ లాంటిదని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బుడగ.. పగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో చెప్పి బీజేపీ వరంగల్ ఎన్నికల్లో ప్రచారాని రావాలని.. ఖమ్మంలో గిరిజన యూనివర్సిటీ ఏమైందో చెప్పాలని నిలదీశారు. మతపరమైన అంశాలు తప్పితే బీజేపీ అభివృద్ధి గురించి ఏం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ ది గల్లీలో కుస్తీ… ఢిల్లీలో దోస్తీ అన్నట్టు ఉందని… రైతు వ్యతిరేక చట్టాలను కూడా ఇప్పుడు కేసీఆర్ మద్దతు పలికారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు కరోనా సమయం కాబట్టే ఏర్పాటు చేసినట్టు అబద్దం చెప్పారని.. రైతులకు మేలు చేసే అంశం..లాభ నష్టాల గురించి ఆలోచిస్తారా..? అని ప్రశ్నించారు. 7 వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పడం..కేసీఆర్ చేతగాని తనానికి నిదర్శనమన్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పై సీనియర్ల తో సమావేశమై.. అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తులపై జీవన్ రెడ్డి కమిటీ ఉందని..ఆ నివేదిక ఆధారంగా ఠాగూర్ ప్రకటన చేస్తారని తెలిపారు.
previous post
దోచుకున్నది దాచుకోవడానికే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్