telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సభలో కోవిడ్ నిబంధనలు పాటించాలి: స్పీకర్ పోచారం

pocharam srinivasreddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మంత్రులను సున్నితంగా మందలించారు. కరోనా వైరస్ కారణంగా సభలో కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అసెంబ్లీలో సభ్యుల మధ్య కొన్ని సీట్లను నో సీటింగ్ జోన్ లుగా ప్రకటించారు.

సభ జరుగుతున్న సమయంలో మంత్రి ఈటల రాజేందర్ పక్కనే ఉన్న నో సీటింగ్ ప్రాంతంలో మరో మంత్రి జగదీశ్ రెడ్డి వెళ్లి కూర్చున్నారు. దీన్ని గమనించిన పోచారం, ఆ సీట్లో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. నో సీటింగ్ సీట్ లో కూర్చోవద్దని హెచ్చరించారు. దీంతో అప్పటివరకూ ఈటల పక్కనే ఉన్న జగదీశ్ రెడ్డి అక్కడి నుంచి లేచి తన స్థానంలోకి వెళ్లిపోయారు.

Related posts