అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన చేపట్టిన యాత్ర అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పేరేచర్ల రోడ్డు విస్తరణ, దేవరంపాడు ఆలయ అభివృద్ది పనులు చేయాలని డిమాండ్లతో రాజుపాలెం నుండి దేవరంపాడు వేంటేశ్వస్వామి గుడి వద్దకు చంద్రన్న అశయ సాధన యాత్ర నిర్వహించాలని కొడెల భావించారు.
అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు.దీంతో సత్తెనపల్లి పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ ,కోడెల కార్యలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.