telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావాలి..

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌ శ్రేణులకు కీలక సూచలను చేశారు మంత్రి కేటీఆర్.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. దయచేసి కేవలం ఆహ్వానాలు అందినవారే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రావాలని చెప్పారు. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయడం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Image

తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా టీఆర్ఎస్‌ పార్టీ పుట్టిందని తెలిపారు మంత్రి కేటీఆర్.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో సభ జరుగుతుందని.. 21 ఏళ్ల తెరాస.. బాల్యదశ నుంచి మేజర్​గా మారింద‌ని అన్నారు.. కావున 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం అన్నారు

రేపు హైదరాబాద్‌ నగర ప్రతినిధులతో సమావేశం ఉంటుందని, సభకు సంబంధించిన విషయాలు చర్చిస్తామని అన్నారు.

Image

అలాగే 12,769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించాలన్నారు. 3600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పారు.

Related posts