హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులకు కీలక సూచలను చేశారు మంత్రి కేటీఆర్.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. దయచేసి కేవలం ఆహ్వానాలు అందినవారే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రావాలని చెప్పారు. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయడం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని తెలిపారు మంత్రి కేటీఆర్.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సభ జరుగుతుందని.. 21 ఏళ్ల తెరాస.. బాల్యదశ నుంచి మేజర్గా మారిందని అన్నారు.. కావున 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం అన్నారు
రేపు హైదరాబాద్ నగర ప్రతినిధులతో సమావేశం ఉంటుందని, సభకు సంబంధించిన విషయాలు చర్చిస్తామని అన్నారు.
అలాగే 12,769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించాలన్నారు. 3600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న మాదాపూర్ హైటెక్స్ లో ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో ప్లీనరీ స్థలాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS పరిశీలించారు. pic.twitter.com/4CVSh2uAct
— TRS Party (@trspartyonline) April 17, 2022