తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు తెన్కాశీ జిల్లాలో జరిగింది. శంకరన్కోవిల్ ప్రాంతానికి చెందిన 50 సంవత్సరాల మహేశ్వరి… ఎన్నో ఆశలతో తన కుమార్తె వివాహం కోసం షాపింగ్ చేసేందుకు సమీప పట్టణానికి వెళ్లి, ఓ మినీ బస్సులో సరదగా తిరిగివస్తోంది. తన స్టాప్లో దిగేందుకు సిద్ధమవుతుండగా ఇంతలో బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు.
దీంతో బస్సులో నుంచి మహేశ్వరి ఒక్కసారిగా కిందపడంతో తీవ్రంగా గాయాలయ్యాయి.మహేశ్వరిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మృతి చెందింది. దీంతో నిరక్షంగా బస్సు నడిపినందుకు బస్సు యజమాని, డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.