telugu navyamedia
క్రైమ్ వార్తలు

క‌దులుతున్న‌బస్సులో నుంచి జారి పడి మహిళ మృతి..

తమిళనాడులో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. క‌దులుతున్న బస్సులో నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు తెన్​కాశీ జిల్లాలో జరిగింది. శంకరన్​కోవిల్ ప్రాంతానికి చెందిన 50 సంవ‌త్స‌రాల  మహేశ్వరి… ఎన్నో ఆశ‌ల‌తో తన కుమార్తె వివాహం కోసం షాపింగ్ చేసేందుకు సమీప పట్టణానికి వెళ్లి, ఓ మినీ బస్సులో స‌ర‌దగా తిరిగివస్తోంది. తన స్టాప్​లో దిగేందుకు సిద్ధమవుతుండగా ఇంత‌లో బస్సు డ్రైవర్​ స‌డ‌న్‌గా బ్రేక్​ వేశాడు.

దీంతో బస్సులో నుంచి మహేశ్వరి ఒక్క‌సారిగా కిందపడంతో తీవ్రంగా గాయాల‌య్యాయి.మహేశ్వరిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మృతి చెందింది. దీంతో నిర‌క్షంగా బ‌స్సు న‌డిపినందుకు బస్సు యజమాని, డ్రైవర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related posts