telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో దారుణం… ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మిస్సింగ్‌

హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం అయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. నిన్న ఉదయం నుంచి బాలికలు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ బాలికల తల్లిదండ్రులు. ఐశ్వర్య(17), ఆస్మా(15), అబీర్(14) అదృశ్యమైనట్లు ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు బుక్‌ చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేపట్టారు. అయితే… ప్రగతినగర్‌కు చెందిన రమేశ్ కిడ్నాప్ చేసినట్లు బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. రమేశ్‌ గతంలో ఐశ్యర్య వెంటపడేవాడని.. ప్రేమిస్తున్నారంటూ వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఐశ్యర్యను వేధిస్తున్న రమేశ్‌ను తాము హెచ్చరించామని కూడా వాళ్లు చెప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు బుక్‌ చేసి…. రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అటు ఆ బాలికల కోసం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Related posts