telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

తబ్లిగీ జమాత్ చీఫ్ పై సెక్షన్ 304 కింద కేసులు

tabligi jamath masood

ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కాంధ్వలీపై నేరపూరిత హత్య కేసు నమోదైంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను గాలికి వదిలేసి మతపరమైన సదస్సు నిర్వహించిన ఆయనపై ఈ మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ సదస్సు నిర్వహించిన తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు, సదస్సుకు హాజరైన వారిలో చాలామంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఘటన కారణంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. నిజాముద్దీన్ పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు సాద్‌పై సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts