కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ భోపాల్లో రోడ్షో నిర్వహించారు. సాధువులు పాల్గొన్న ఈ రోడ్షోలో కొందరు పోలీసులు సివిల్ దుస్తుల్లో కన్పించారు. తెలుపు రంగులో ఉన్న చొక్కాను ధరించిన కొందరు పోలీసులు మెడలో కాషాయ కండువాను వేసుకున్నారు.
దీనిపై పోలీసులను వివరణ కోరగా ఓ మహిళా పోలీసు మాట్లాడుతూ.. కంప్యూటర్ బాబా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్షోకు భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఈ దుస్తులను ధరించేలా కొందరు చేశారని చెప్పారు. అయితే ఈ దుస్తులను ఎవరు ధరించమని చెప్పారు? అని అడిగితే ఆ మహిళా పోలీసు సమాధానం చెప్పలేదు.
బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ పనితీరు సరిగా లేదు: వెంగ్ సర్కార్