ఐసీసీ కొన్ని సరికొత్త విధానాలను మరికొద్ది రోజులలో ప్రారంభం కానున్న సిరీస్ లతో ప్రవేశపెడుతోంది. ఈ విధానాలలో ఒకటి, టెస్టు క్రికెట్లోనూ ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లు ముద్రించనున్నారు. ఇప్పటివరకు ఈ విధానం పరిమిత ఓవర్ల క్రికెట్లోనే కనిపించింది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్, ఐసీసీ నంబర్లు, పేర్లు ఉన్న జెర్సీలు ధరించిన ఆటగాళ్ల ఫొటోలను ట్విట్టర్ పోస్టు చేశాయి.
రెండవ విధానం, కాంకషన్ సబ్ స్టిట్యూట్ ను కూడా యాషెస్ సిరీస్ తో ప్రవేశపెడుతున్నారు. కాంకషన్ సబ్ స్టిట్యూట్ అంటే, ఎవరైనా ఆటగాడు తలకు బలమైన దెబ్బ తగిలి ఆటలో కొనసాగే అవకాశం లేకపోతే, అతడికి బదులుగా మైదానంలో దిగే సబ్ స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేయొచ్చు. అంతేగాకుండా, యాషెస్ సిరీస్ తోనే ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ కూడా ప్రారంభం కానుంది. ఇకమీదట టెస్టు క్రికెట్ ఆడే దేశాలు ఈ చాంపియన్ షిప్ లో భాగంగా ఇతర జట్లతో టెస్టు మ్యాచ్ లు ఆడతాయి.