దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో సడలింపులు ఇస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభణ తగ్గక ముందే సడలింపులు ఇవ్వడం వల్ల ఇన్నాళ్లూ పాటించిన లాక్డౌన్ వృథా అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలన్నారు.
మద్యం అమ్మకాలపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ స్పందించారు. మద్యం దుకాణాలను తెరవడం కరోనా విజృంభణకు కారణమవుతుందన్నారు. శరీరంలో రోగ నిరోధకతను తగ్గిస్తుందని, గృహ హింస పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ కోసం ఇతర మార్గాలను చూసుకోవాలని తెలిపారు. ప్రజల జీవితాలను ప్రమాదంలో పెట్టొద్దని లక్ష్మీ నారాయణ సూచించారు.