telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దాడుల పై లోకేశ్ కు వివరించిన టీడీపీ కార్యకర్తలు

Minister Lokesh comments YS Jagan

గుంటూరు జిల్లా ముట్లూరు గ్రామ టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ నేత నారా లోకేశ్ ను కలిశారు. ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపారంటూ అరవై ఎస్సీ కుటుంబాలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని వాపోయారు. దొంగ కేసులు బనాయిస్తున్నారని లోకేశ్ కు చెప్పారు. టీడీపీ మద్దతుదారులు 180 మందిని గ్రామాల నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.

దాడుల విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ లోకేశ్ కు చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ, గ్రామానికి పార్టీ తరపున ఓ కమిటీని త్వరలోనే పంపిస్తామని హామీ ఇచ్చారు. కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ చేసే న్యాయపోరాటానికి సహకారం అందిస్తామని లోకేశ్ కార్యకర్తలకు భరోసా కల్పించారు.

Related posts