అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడం వంటివి ఈ బిల్లులో ప్రతిపాదించారు. రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లు లోక్సభ ఆమోదానికి వెళ్లనుంది. చైల్డ్ పోర్నోగ్రఫీని అరికట్టేందుకు జరిమానా, జైలు శిక్ష వంటివి కూడా ఈ బిల్లులో ఉన్నాయి.
పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలను అదుపులోకి తెచ్చేందుకు గానూ ఈ చట్టాన్ని సవరించేందుకు ఈ నెల మొదట్లో జరిగిన భేటీలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ప్రభుత్వానికి సంపూర్ణ బలం ఉన్నందున ఈ బిల్లు చట్టరూపం దాల్చడం లాంఛనం కానుంది.
నాగబాబు కామెంట్స్ పై స్పందించిన పవన్