టెలికం రంగంలో ఆయా కంపెనీల మధ్య పోటీ రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో కంపెనీలు కస్టమర్లను కాపాడుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా టెలికం ఆపరేటర్ వొడాఫోన్ మరో రెండు కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. వీటి ద్వారా 4జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, 600 మెసేజ్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
కొత్త వాటిలో ఒకటి రూ.205 రీచార్జ్ ప్యాక్ కాగా, మరోటి రూ.225 ప్రీపెయిడ్ ప్యాక్. రూ.205 ప్యాక్ కాలపరిమితి 35 రోజులు కాగా, రూ.225 ప్లాన్ కాలపరిమితి 48 రోజులు. రూ.205 ప్లాన్లో 2జీబీ 3జీ/4జీ డేటా లభిస్తుంది. రూ.225 ప్లాన్లో 4జీబీ డేటా లభిస్తుంది. రెండింటిలోనూ అపరిమిత వాయిస్ కాల్స్, 600 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. దీంతోపాటు వొడాపోన్ ప్లే యాప్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.