కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి గనుల అక్రమాల కేసులో భారీగా మనీ లాండరింగ్కు పాల్పడినట్టు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనాన్ని రేపింది.కేసు విచారణలో భాగంగా నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు జనార్దన్రెడ్డి హాజరయ్యారు.
బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. పలు కీలక అంశాలపై అధికారులు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నగదు లావాదేవీలను విదేశాలకు తరలించడంపై అధికారులు జనార్దన్రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.