telugu navyamedia
రాజకీయ వార్తలు

మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం పై షీలా దీక్షిత్ స్పందన!

sheela dikshit

మెట్రోరైళ్లు, క్లస్టర్ బస్సులు, డీటీసీ బస్సులు సహా అన్ని ప్రజా రవాణా సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన తెలిసిందే. దీనికోసం అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం షీలా దీక్షిత్ స్పందించారు.

మెట్రోరైళ్లు, బస్సులు సహా ప్రజా రవాణా ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయంలో భాగమేనని ఆమె పేర్కొన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇది కేవలం వాళ్ల ప్రయోజనం కోసమే తప్ప మరెవ్వరి కోసం కాదు. దీన్ని రాజకీయ నిర్ణయంగానే భావించాలన్నారు.

Related posts