telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ప్లిప్‌కార్ట్ యూజర్లకు శుభవార్త…

flipkart new feature to make online shopping easier

ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ల‌తో ప్ర‌త్యేక ఆఫ‌ర్‌ను ప్రారంభిస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో మే 2 నుంచి మే 7వ తేదీ వరకు కొన‌సాగ‌నుంది ఈ ప్ర‌త్యేక సేల్.. ఇక‌, ప్లిప్‌కార్ట్ ప్ల‌స్ స‌భ్యుల‌కు అయితే, ఒక‌రోజు ముందుగానే అంటే.. మే 1వ తేదీ అర్ధ‌రాత్రి నుంచే ఈ ఆఫ‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్‌లో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ‌టీవీలు, టాబ్లెట్లు, ఆడియో డివైజ్‌లు, హెడ్‌ఫోన్లు, బ్లూటూత్‌ స్పీకర్లు… ఇలా ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు తీసుకొస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఎలక్ట్రానిక్స్‌, యాక్సెసరీలపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ ల‌భించ‌నుండ‌గా.. ఎక్స్చేంజ్‌ ఆఫర్లు కూడా తెస్తుంది.. మ‌రోవైపు.. ఎలక్ట్రానిక్స్‌, స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎల‌క్ట్రానిక్స్ గూడ్స్‌పై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్నికూడా తీసుకొస్తుంది. యాపిల్‌, వివో, ఆసుస్‌, షియోమీ లాంటి ప‌లు కంపెనీలకు చెందిన ఉత్ప‌త్తులు ఈ సేల్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి.

Related posts