telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టీ20ల్లో అంత సులువు కాదు : యువరాజ్

దుబాయ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2020 38 వ మ్యాచ్ లో డేలో క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ యొక్క 13 సంవత్సరాల చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా ధావన్ నిలిచాడు, అతను ఇంతక ముందు మ్యాచ్ లో 58 బంతుల్లో వరుసగా 2వ టి 20 సెంచరీని సాధించాడు. ఇక ఈ రోజు డిసి కెప్టెన్ టాస్ గెలిచిన తరువాత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇందులో ధావన్ 20 ఓవర్లు నిలబడి 61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 బాధి నాటౌట్ గా ముగించాడు.

ఇక ఈ మ్యాచ్ 19 వ ఓవర్లో తన 2వ ఐపీఎల్ సెంచరీని సాధించి జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేయడంలో సహాయం చేసాడు. దాంతో అతని నాక్ కు సోషల్ మీడియాలో చాలా ప్రశంసల వర్షం కురుస్తుంది. టీ 20 ఫార్మటు అయిన ఐపీఎల్ 2020 లో వరుసగా 2 శతకాలు బాదడం అంత సులువు కాదు అని గబ్బర్ కు అభినందనలు తెలుపుతూ యువరాజ్ సింగ్ అన్నాడు. అలాగే ఐసీసీ, సచిన్, రైనా ఇలా చాలా మంది మాజీలు ధావన్ కు అభినందనలు చెప్తున్నారు.

Related posts