ఏపీలో ఎడ్ సెట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. బీఎడ్, స్పెషల్ బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8న ఏపీ ఎడ్ సెట్ నిర్వహించారు.
ఈ ప్రవేశ పరీక్షను ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తరఫున ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికావడంతో, అధికారులు నేడు ఫలితాలు విడుదల చేశారు.
ఈ ఏడాది ఎడ్ సెట్ పరీక్షకు మొత్తం 9,365 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
జూన్ 15న ప్రిలిమనరీ ఆన్సర్ కీ విడుదల చేశారు. జూన్ 18 వరకు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు.
ఎడ్ సెట్ ఫలితాలను ఈ క్రింది లింకు ద్వారా పొందవచ్చు.
https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx
రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు: దేవినేని