telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

గుడ్ న్యూస్ : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ జోరు కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. ఇవాళ ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల విషయానికొస్తే 2918 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసులు 78050కి చేరింది. ఇక నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు ఇవాళ తగ్గాయి. ఈరోజు 24 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6453కి చేరుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 78050 పాజిటివ్ కేసులకు గాను, 744532 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 35065 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కరోనా మరణాలు తగ్గిన కూడా తూర్పు గోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుతున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 7127533 కరోనా టెస్టులు చేశారు.

Related posts