వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆయనకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు టికెట్ ఖరారు చేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. వంగవీటి రాధకు అసెంబ్లీ సీటును కేటాయించలేమని, అనకాపల్లి లేదా నరసరావుపేట నియోజకవర్గ౦ నుంచి ఎంపీ పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇంచ్చినట్టు తెలుస్తోంది. అనకాపల్లి కన్నా, విజయవాడకు దగ్గరగా ఉండే నరసరావుపేట వైపే వంగవీటి మొగ్గును చూపుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
చంద్రబాబుతో భేటీ తర్వాతనే వంగవీటి రాధా టీడీపిలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన డిమాండ్లపై చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీలు లభించిన తర్వాత ఆయన టీడీపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.వంగవీటి రాధా ఇటీవల వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కొడాలి నానిని కలుసుకోవడంపై కూడా రాజకీయాల్లో చర్చ జరిగింది. చివరకు ఆయన టీడీపిలో చేరాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సచివాలయాన్ని కూలగొట్టించడానికి కేసీఆర్ సిద్దమయ్యారు: రేవంత్ రెడ్డి