telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వరద బాధితులకు రూ. 10కోట్లు ప్రకటించిన మేఘ సంస్థ..

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్, అండ్ ఇన్ఫ్రా సంస్థ (MEIL) వెంటనే స్పందించింది. సీఎం సహాయనిధికి (CMRF) పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది. ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. వరద బాధితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ సహాయం తోడ్పడుతుందని అభిప్రాయపడింది. కాగా హైదరాబాద్ వ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందారు. అయితే మరో నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Related posts