telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రనూమండల్‌ పై హిమేష్ రేష్మియా ఘాటు వ్యాఖ్యలు

Himesh

పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ వద్ద పాటలు పాడుకుంటూ జీవనం సాగించే ర‌ణు మొండ‌ల్ ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీ అయిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, గాయకుడు హిమేష్ రేష్మియాతో క‌లిసి ‘తేరీ మేరీ కహానీ’ పాట పాడిన రనూ మండల్‌కు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఇటీవ‌ల‌ ఆమె అభిమానుల‌తో ప్ర‌వ‌ర్తించిన తీరుతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిమేష్ రేష్మియా నుంచే ఘాటు వ్యాఖ్యలు ఎదురయ్యాయి. దీనికి ముందు రానూను ఒక ఫ్యాన్ సెల్ఫీ అడగగా అందుకు నిరాకరించి వివాదాల్లో చిక్కుకున్నారు. తరువాత మేకప్ కారణంగా చర్చనీయాంశంగా మారారు. తాజాగా రనూ మండల్ కారణంగా హిమేష్ రేష్మియా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న హిమేష్ రేష్మియాను మీడియా ప్రతినిధులు రనూ మండల్ గురించి అడగగా, ఆయన ఆవేశంతో ఊగిపోతూ తానేమీ రనూ మండల్‌కు మేనేజర్‌ను కానని ఘాటుగా సమాధానమిచ్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలు ఎంతవరకూ దారి తీస్తాయో వేచి చూడాలి.

Related posts