telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిని స్మరించుకున్న మెగాస్టార్‌

నేడు (సెప్టెంబర్ 2) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి. ఈ సందర్బంగా ఆ నేతను పార్టీ నాయకులు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్. 2009 లోను రెండోసారి అధికారంలోకి వచ్చారు.తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజశేఖర రెడ్డి.

నేడు ఆయన వర్ధంతి సందర్బంగా పలువురు ప్రముఖులు స్మరించుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. ‘దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ ప్రజా నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన్ని సంస్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా..’ అంటూ చిరు ట్వీట్ చేశారు.

Related posts