telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కష్టపడి గెలిపిస్తే టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారు: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మేల్యేలు పార్టీ ఫిరాయింపు ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నటి విజయశాంతి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కష్టపడి గెలిపిస్తే టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త అంతా పార్టీ నుంచి పోతోందని కొత్త రక్తం వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న పౌరుషం, కాంగ్రెస్ పార్టీ ‘బీ’ ఫామ్ తీసుకునేటప్పుడు ఏమైందని ప్రశ్నించారు.

ఇంటర్మిడియట్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలకు సీఎం కేసీఆర్ దే బాధ్యత అని అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ స్పందించరా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడంలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు బాధ్యతలు లేవని దుయ్యబట్టారు.

Related posts