వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుండి తరలింపు ప్రారంభమైంది. ఇక్కడున్న ఫర్నీచర్ ను ఉండవల్లికి చేరుస్తున్నారు. ఈ పనులు రేపటితో పూర్తవుతాయని, ఆపై 16వ తేదీన పార్టీ కౌంటింగ్ ఏజంట్ల శిక్షణ ఉండవల్లిలోనే జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అమరావతి ప్రాంతంలో తన నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న జగన్, ఫిబ్రవరి 27న గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే వైసీపీ అధినేత జగన్ నివాసంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్నాయి.. గెలుపు వార్తలు ఖరారు కావటంతో, రాజధానిలో జగన్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టున్నాయి.
కేసీఆర్ దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం: రేవంత్ రెడ్డి