telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలు అవుతున్నాయా..?

Harish Rao TRS

నిన్న సంగారెడ్డిలో తెరాస కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని  మంత్రి హరీష్ రావు అన్నారు. … త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించామని.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తెరాస ప్రభుత్వ పథకాల లబ్ది పొందిందన్నారు. ప్రభుత్వ పథకాలు… లబ్ధిదారుల బ్యాంక్  లో పడితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుర్తింపు రావడం లేదని కార్యకర్తలు చెప్తున్నారని..ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళతానని పేర్కొన్నారు.  టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని.. పక్కన ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు అమలు అవుతున్నాయా ? అని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ అని…సమైక్య వాద పార్టీలకు అసెంబ్లీలో సవాలు చేశామని గుర్తు చేశారు.   త్వరలోనే  జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై ప్రత్యర్థి నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది.

Related posts