కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మరోసారి నిప్పులు చెరిగారు. నేరస్తుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం లాలూచీ ధోరణితో వ్యవహరిస్తుందని ఆమె ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎత్తి చూపితే.. హత్యలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. “అధికార పార్టీ నేతలు చాలా సందర్భాలలో నిందితులను తప్పించడం, బలహీనమైన చార్జిషీట్లు వేయించి, కేసుల విచారణలో సరైన శ్రద్ధ వహించకపోవడం వల్ల అనేకమంది నేరం చేసి కూడా బయటపడుతున్నారు. అదే విధంగా ఏదో ఒక కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకున్న నేరస్తుల కేసులను పై కోర్టులలో అప్పీలు చెయ్యకుండా ప్రభుత్వం లాలూచీ ధోరణితో వ్యవహరించడం అత్యంత దారుణం. విచారణలో తప్పించుకున్న క్రిమినల్స్ మరల దారుణమైన నేరాలకు పాల్పడుతుండటం చూస్తున్నాము. తెలంగాణలో ఇంతవరకూ అప్పీళ్ళకు పోని నేరారోపిత కేసుల వివరాలు మొత్తం ప్రభుత్వం ప్రకటించి, అందుకు కారణాలేమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఆ విధంగానైనా ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
previous post
బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా