telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది…

సీఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే రాళ్ళతో కొట్టమన్నారని.. కేసీఆర్ ను త్వరలోనే రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని విజయశాంతి హెచ్చరించారు. కేసీఆర్ కి ఏనాడు దళిత బిడ్డల మీద ప్రేమ లేదని.. బడుగు, బలహీన వర్గాలను చిన్న చూపు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయనకి దొర తనం అడ్డు వస్తుందని… ఇచ్చిన మాటకు కట్టుబడి లేడని మండి పడ్డారు. కేసీఆర్ చాలా హీనంగా మాట్లాడేవాడని… Trs గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని అనిపిస్తోందని ఎద్దేవా చేసారు. కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి…  అందరికి న్యాయం జరగాలని విజయశాంతి పేర్కొన్నారు. కేసీఆర్, మంత్రులు…. ప్రజల్ని కుక్కలు అని సంబోధిస్తున్నారని… మీ వార్నింగ్ లకు మేము భయపడం.. ఎంత దూరం అయిన వెళ్తామని ఆమె హెచ్చరించారు. ఈ అరాచక ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని పేర్కొన్నారు.

Related posts