telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు ప్రపంచంలోనే చెండాలమైన రాజకీయనేత

టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 309 కోట్లు కేటాయించి సిఎం జగన్ గారు ప్రజల పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలతో పాటు 50 క్రయోజనిక్ ట్యాంకర్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇక ప్రాణవాయవుకు కొరత ఉండదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగావు. పచ్చ మాఫియాను సృష్టించి రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతినమని వదిలి పెట్టావు. ఓడించినందుకు ప్రజలపై పగ పెంచుకుని ఏపీ ప్రతిష్టనే దెబ్బతీసే కుట్రలు చేస్తున్నావు. ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు…చంద్రం.కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఫ్రీ వైద్యం అందిస్తున్నారని పొరుగు రాష్ట్రాలు జగన్ గారిపై ప్రశంసల జల్లు కురిపిస్తుంటే పచ్చ వైరస్ కు కడుపు మండిపోతోంది. పక్క రాష్ట్రంలో ఉంటూ వేరే రాష్ట్ర సీఎంలకు ఫోన్లు చేసి మరీ ఏడుస్తున్నాడు.’ ప్రపంచంలోనే చంద్రబాబు చెండాలమైన రాజకీయవేత్త’ అనేది అందుకే.” అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Related posts