telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాతృ భాషను మృత భాషగా మార్చకండి: పవన్ కల్యాణ్

pawan-kalyan

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ఏపీ సర్కార్ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు మీడియాను నడుపుతూ, తెలుగును చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సూచిస్తోందంటూ సీఎం జగన్ పై పవన్ మండిపడ్డారు. మాతృ భాషను మృత భాషగా మార్చకండని అన్నారు.

ఇంగ్లీషు భాష వద్దని ఎవరూ చెప్పడం లేదని… కానీ, తెలుగును మాతృ భాషగా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. మాతృ భాషను, మన మాండలికాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అన్నారు. ‘జగన్ రెడ్డి గారు, ‘మా తెలుగు తల్లికి’ అంటూ పాడాల్సిన మీరు… తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాష సరస్వతిని అవమానించకండి అని చెప్పారు. ఈ సందర్భంగా సరస్వతి దేవి ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

Related posts