telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా.. సోనియా గాంధీ..

sonia gandhi nomination from raebareli

సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌.. సోనియా పేరును ప్రతిపాదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లలో మాత్రం గెలిచింది. ప్రతిపక్ష హోదా దక్కాలన్నా ఆ పార్టీకి మరో మూడు సీట్లు తక్కువే ఉన్నాయి.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వారే.. పార్లమెంట్‌లో పార్టీ నేతను ఎన్నకుంటారు. గత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా మల్లిఖార్జున్ ఖర్గే కొనసాగారు. అయితే ఖర్గే కర్నాటకలోని గుల్బ్‌ర్గా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Related posts