telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది : వర్లరామయ్య

విజయవాడలో ప్రేమోన్మాది చేసిన దారుణ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో దళితులకు,దళిత మహిళలకు,యువతులకు రక్షణ లేకుండా పోయింది అని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. దళిత యువతి దివ్యతేజస్వని హత్యకు బాధ్యత ఎవరు వహిస్తారు అని ప్రశ్నించారు. నేరగాళ్లకు అండగా,బాసటగా నిలుస్తోంది ప్రభుత్వం. నేరగాళ్లకు పోలీసులు అన్నా,ప్రభుత్వం అన్నా భయం లేదు అని అన్నారు. ప్రేమ అనే ముసుగులో దివ్యతేజస్వని బలైపోయింది. ముఖ్యమంత్రి జగన్ అసమర్ధ,అన్యాయ,నీచ రాజకీయాలు పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలి అన్నారు. తప్పు చేస్తే కఠినంగా  వ్యవహరించే విధంగా ప్రభుత్వం నడుచుకోవాలి. దళిత హోంమంత్రి ఓ దళిత యువతి హత్యకు గురయితే ఇంతవరకు స్పందించలేదు అని చెప్పారు. ఇదేనా దళిత హోమంత్రికి దళితులపై ఉన్నప్రేమ అని అడిగారు. దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలకు జగన్ సమాధానం చెప్పాలి అన్నారు. అయితే 

Related posts