తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. గోదావరి జలాలతో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సాధించుకున్న ఫలాలు ఈ రోజు సిద్దిపేటకు అందాయని చెప్పారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు. గాంధీ కలలుగన్న గ్రామీణ భారతాన్ని పల్లెప్రగతి ద్వారా సాధించామని చెప్పారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద మంత్రి కే తారకరామారావు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురువేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆరో వార్షికోత్సవంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేశారు.