వృద్దాప్యంలో ఉన్న అత్తమామలను ఓ కిరాతక కోడలు హత్య చేసింది. ఈ దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. పశ్చిమ ఢిల్లీలోని దుర్గా విహార్ ప్రాంతంలో వృద్ధ దంపతులు రాజ్ సింగ్ (61), ఓంవతి (58) నివసిస్తుంటారని తెలిపారు. నిన్న ఒకే మంచం మీద ఆ వృద్ధ దంపతుల మృతదేహాలు కనిపించడంతో తమకు స్థానికులు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. మృతుల ముఖాల మీద గాయాలు ఉన్నాయని చెప్పారు.
ఈ హత్య జరిగిన సమయంలో కవిత భర్తతో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా అదే గదిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో వారిని కోడలు కవిత (35) హత్య చేసిందని తేలినట్లు చెప్పారు. ఈ హత్యలకు ఆస్తి వివాదమే కారణమని పోలీసులు గుర్తించారు. తన భర్త సతీశ్ సింగ్ (37) ఎదుటే ఆమె అత్తమామలను చంపిందని పోలీసులు భావిస్తున్నారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
.
చంద్రబాబు తనిఖీపై హంగామా అవసరం లేదు: మంత్రి బొత్స