telugu navyamedia
రాజకీయ వార్తలు

హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు

మంత్రి హరీష్ రావు సమక్షంలో దుబ్బాకలోని  స్థానిక కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా.. హరీష్ రావు మాట్లాడుతూ…దుబ్బాక కు కాంగ్రెస్ ,బిజెపి వాళ్లు ఎన్నికల ముందే వస్తారని..బిజెపి పరిపాలించే రాష్ట్రాల్లో 400 పెన్షన్ లు ఇస్తున్నారని తెలిపారు. పెన్షన్లలో 16 పైసలు ఇస్తాలేదని రుజువు చేస్తా అని..  దుబ్బాక చౌరస్తా లో ముక్కు నేలకు రాస్తారా అని అడిగితే సమాధానం లేదని ఫైర్ అయ్యారు. ESI ఆసుపత్రి గజ్వేల్ తీసుకెళ్లామని అబద్ధాలు చెప్పారని.. అది సాంక్షన్ కూడా కాలేదని పేర్కొన్నారు. 

బిజెపి వాళ్ళు అబద్ధాల పునాదుల మీద డిపాజిట్ దక్కించుకోవాలని చూస్తున్నారని… నిజం ధర్మం ఎప్పటికి గెలుస్తుందన్నారు. లక్ష యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చామని..మరో ముప్పై వేల ఉద్యోగాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.  బిజెపి ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఎక్కడ ఆరు కోట్ల ఉద్యోగాలు ? అని ప్రశ్నించారు. విదేశాలలో ఉండే నల్ల ధనం ఏమైంది?…ప్రతి అకౌంట్ కి 15 లక్షలు వస్తాయని అన్నారు.. 1500 కూడా రాలేదని నిలదీశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డ్ తెస్తా అని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Related posts