కలియుగ వైకుంఠ స్వామి తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది.. ఈ నెల 13న అర్థరాత్రి నుంచి 22 వరకు పది రోజులపాటు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కలగనుంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమల తిరుపతికి చేరుకుంటారు.
కాగా, శ్రీవారి ఆలయంలో 1863లో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనాన్ని అప్పటి మహంతు సేవాదాస్ ప్రారంభించారు.. ఇక, 1949లో వైకుంఠ ద్వాదశికి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం.
అప్పటి నుంచి రోజు రోజుకి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల సంఖ్య పెరగడడం.. అందిరికీ ఒకేరోజు శ్రీవారి దర్శనం కల్పించడం కష్టమవుతోన్న నేపథ్యంలో.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.
2020 ఏడాది నుంచి శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించింది.దేవతలకు ఒక్క రోజు మానవులుకు 365 రోజులుగా చెబుతారు. దేవతలకు ఒక్క గంట మానవులుకు 15 రోజులుగా కూడా చెబుతుంటారు.. మహావిష్ణువు ముక్కోటి దేవతలకు 40 నిమిషాలు దర్శన భాగ్యం కల్పిస్తే.. వైకుంఠ ఏకాదశి నుంచి వచ్చే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ.
రోజుకు 20 వేల మందికి 300 రూపాయల టికెట్లు, 5వేల మందికి ఆఫ్ లైన్ లో, 5 వేల మందికి ఆన్ లైన్ లో ఉచిత దర్శనం టోకెన్లు టీటీడీ జారీ చేసింది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్, విఐపిలకు అదనంగా దాదాపు మరో10 వేల టిక్కెట్లను జారీ చేయనున్నది. భక్తుల రద్దీ తగిన విధంగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. టిటిడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతేకాదు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని.. టిటిడీ కోరుతుంది. మరోవైపు ఈ నెల 22 వరకు సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.
కాగా.. వైకుంఠ ఏకాదశి పురుస్కరించుకొని శ్రీవారి ఆలయం ముస్తాబైంది. రంగురంగుల విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు.
భయంతోనే చంద్రబాబు సైలెంట్: విజయసాయిరెడ్డి