అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, ఏ క్షణమైనా అతన్ని అరెస్టు చేస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ ఎ.ఎస్.ఖాన్ తెలిపారు. పోలీస్ గెస్ట్హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించడం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం వంటి పలు కేసులు ఆయనపై ఉన్నాయని చెప్పారు.
ఇటీవల రాజమహేంద్రవరం కోర్టు స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా ఎంపీ హర్షకుమార్ ఘటనా స్థలికి వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుష పదజాలంతో దూషించారని, అక్కడ ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించారని తెలిపారు. అక్కడి మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. దీనిపై జిల్లా కోర్టు పరిపాలనాధికారి మూడో పట్టణ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఐజీ వివరించారు.
బాలయ్య డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు: పోసాని