telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొందరు విమర్శలు చేయడం చాలా బాధ కలిగించింది: నరసింహన్

Narasinhan

తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మరికొన్నిరోజుల్లో వీడ్కోలు తీసుకోనున్నారు. ఇటీవలే ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం, తెలంగాణకు కూడా నూతన గవర్నర్ ను నియమించింది. ఈ నేపథ్యంలో నరసింహన్ రాజ్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పరమైన అంశాల కంటే, ఇతర అంశాలే తనను ఎక్కువగా బాధించాయని అన్నారు.

తనకు దైవభక్తి ఎక్కువని, ఆ కారణంగానే తరచుగా ఆలయాల సందర్శనకు వెళుతుంటానని తెలిపారు. కానీ ఆలయాల సందర్శనపై కొందరు చేసిన విమర్శలు చేయడం చాలా బాధ కలిగించిందని తెలిపారు. అదేపనిగా ఆలయాల చుట్టూ తిరుగుతుంటారని తనపై వ్యాఖ్యలు చేశారని అన్నారు. తన పదవీకాలంలో ఎక్కువగా వెళ్లింది తిరుమల, భద్రాచలం, యాదగిరిగుట్ట ప్రాంతాలకేనని నరసింహన్ స్పష్టం చేశారు.

Related posts