telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బ్యాంకు నుంచి భారీగా రుణం.. గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్దం!

Ganta srinivas tdp

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. గంటా పార్టీ మారుతున్నట్టు కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. అయితే, ఆయనకు సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంక్ సిద్ధమవుతోంది. ఇండియన్ బ్యాంక్ నుంచి గంటా ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రూ.209 కోట్లు రుణం తీసుకున్నారు.

ఈ అప్పు నిమిత్తం రూ.35 కోట్ల విలువైన ఆస్తులు తనఖా పెట్టినా మిగిలిన బకాయిల కోసం బ్యాంకు గంటా ఆస్తుల వేలానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. రికవరీ కోసం వ్యక్తిగత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకుకు ఉందని బ్యాంకు అధికారులు అంటున్నారు. డిసెంబరు 20న ఆయన ఆస్తుల వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్టు సమాచారం.

Related posts