కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో కరోనా కల్లోలం రేపుతుంది. వైరస్ సోకిందని తెలియగానే కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఏపీ లోని మచిలిపట్నంకు చెందిన నాగేశ్వర్రావు కుమారుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తండ్రి నాగేశ్వర్రావు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రకాశం బ్యారేజ్లో దూకారు. గమనించిన జాతీయ విపత్తు భద్రత సిబ్బంది వెంటనే బ్యారేజ్లో దూకి అతడిని ఒడ్డుకు చేర్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది: ఉత్తమ్