telugu navyamedia
క్రీడలు వార్తలు

అందుకే ఓడిపోయాం అంటున్న ధోని…

నిన్నటి మ్యాచ్ లో ఓటమికి కారణాలు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై స్పందించిన ధోనీ.. ‘నా అభిప్రాయం ప్రకారం ఇదో బ్రిలియంట్ వికెట్. అయితే ఇరు జట్ల మధ్య ఉన్న తేడా మాత్రం ప్రణాళికలను అమలుపర్చడమే. ఈ విషయంలో ముంబై పైచేయి సాధించి విజయాన్నందుకుంది. ఫీల్డర్ల క్యాచ్‌ల సహకారం లేకుండా బౌలర్లు రాణించడం చాలా కష్టం. కీలక సమయంలో క్యాచ్‌లు నేలపాలు చేశాం. టేబుల్ టాపర్‌గా ఓడిపోయామనే బాధలేదు. పటిష్ట బ్యాటింగ్ లైనప్, బిగ్ హిట్టర్స్ ఉన్న జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాం. కానీ ప్రణాళికల ప్రకారం బౌలింగ్ చేయలేకపోయాం. mఆఖరి ఓవర్‌లో ఒకటి, రెండు సిక్స్‌లు కొడితేనే గెలిచే పరిస్థితుల్లో కూడా ఓటమికి తలవంచడం బాధగా ఉంది. కానీ ఇలాంటి ఓటములతోనే ఎక్కువ నేర్చుకుంటాం. పాయింట్స్ టేబుల్లో ఎక్కడా ఉన్నామనే విషయం మాకు అనవసరం. ప్రతీ గేమ్ గెలవడం మాకు ముఖ్యమే. అలా ఆడితే ఆ ఫలితాలే మమ్మల్ని టేబుల్లో మెరుగైన స్థానంలో నిలబెడుతాయి.’అని ధోనీ చెప్పుకొచ్చాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 18 ఓవర్‌లో ముంబై మ్యాచ్ విన్నర్ కీరన్ పొలార్డ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఫాఫ్ డూప్లెసిస్ నేలపాలు చేశాడు. ఈ తప్పిదమే మ్యాచ్ ఫలితాన్ని శాసించింది.

Related posts