వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దేవినేని పై సెటైర్ వేశారు. “ప్రాణం పోయినా సరే పోరాడతా అన్న వాడివి. నమ్మశక్యం కాని అబద్ధం ఆడి పరువు తీసుకున్నావు కదా ఉమా. మార్ఫింగ్ వీడియో చూపిన ట్యాబ్ తిరుపతిలో పోయిందా? పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు. ఇప్పుడు సిఐడి అధికారుల చెవిలో పువ్వు పెట్టాలని చూస్తే, టెక్నాలజీ నిన్ను వదిలి పెడుతుందా? అత్త కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు’ ఏడ్చినట్టుంది ఉమ వ్యవహారం. మార్ఫింగ్ వీడియో ఉన్న’ట్యాబ్’ తిరుపతిలో పోయిందని సిఐడి అధికారుల ముందు బొంకినందుకు కాదంట, దాన్ని బయట ఎలా పెడతారని శివాలెత్తుతున్నాడు. లోపలొకటి బయట ఒకటి ఎందుకు. అలా అన్నావా లేదా? అది చెప్పు.” అంటూ విజయ సాయిరెడ్డి వెల్లడించారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో “పరిపాలన వికేంద్రీకరణకు సిఎం జగన్ గారు పంచాయతీలను బలోపేతం చేసి, వలంటీర్ల వ్వవస్థను తీసుకొచ్చారు. కరోనా రోగుల గుర్తింపు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వీటి సేవలను దేశమంతా ప్రశంసించింది. ఇంత కంటే గొప్ప ఆలోచనలుంటే చెప్పే బదులు బాధ్యత లేకుండా ఎక్కడో దాక్కుని రాళ్లు విసిరితే ఎలా బాబూ?” అంటూ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.
previous post
next post