పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మొదటి ఆరు రౌండ్ లో సువేందు అధికారి స్పష్టమైన ఆధిక్యత కనబరిచిన ఏడో రౌండ్ నుంచి క్రమంగా ఫలితాలు మారుతూ వచ్చాయి. ఏడో రౌండ్ లో మమత లీడింగ్ లోకి వచ్చారు. ఇక ఆ తర్వాత నుండు ఒక రౌండ్ లో మమత, మరో రౌండ్ లో సువేందు లీడింగ్ లోకి వచ్చారు. అయితే, 16 వ రౌండ్ లో మమత పై సువేందు 6 ఓట్ల లీడింగ్ లో ఉండగా, 17 వ రౌండ్ ఫలితం పై ఉత్కంఠ నెలకొంది. కానీ ఆ చివరి రౌండ్ లో మమత 1200 ఓట్ల మెజారిటీని సొంతం చేసుకొని విజయం సాధించారు. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తృణమూల్ సంపూర్ణ విజయం సాధించింది. ఉదయం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 200 లకు పైగా స్థానాలు గెలుచుకుంది.
previous post