నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారయింది. నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉరి వేయనున్నారు. ఈ కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు తీహార్ జైలులో నిర్భయ దోషులకు ఉరిశిక్షను అములు చేయాలని ఆ వారెంట్లో కోర్టు ఆదేశించింది.
నలుగురు నిందితులకు డెత్ వారెంట్ జారీ చేయడం ఇది మూడవసారి. నిందితుల క్షమాభిక్ష పిటిషన్లు కోర్టులో పెండింగ్లో ఉన్న కారణంగా రెండు సార్లు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ ఉరి శిక్ష అమలు కాలేదు. ఈ సారైనా నిందితులకు ఉరిశిక్ష పడుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి ఆశాభావం వ్యక్తం చేసింది.